ఆర్మీ వైస్‌ చీఫ్‌గా  మనోజ్‌ పాండే

2 Feb, 2022 02:27 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ఆర్మీ నూతన వైస్‌ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ సీపీ మహంతీ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటివరకు మనోజ్‌ తూర్పు ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఈ పదవికి తాజాగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆర్‌పీ కలితాను నియమించారు. 1982లో పాండే ఆర్మీలో చేరారు. పలు కీలక పదవులు నిర్వహించడంతో పాటు అనేక కీలక యుద్ధాల్లో పాల్గొన్నారు.

పరమ్‌ విశిష్ఠ సేవా మెడల్‌తో పాటు పలు అవార్డులు ఆయనకు  దక్కాయి. ఏప్రిల్‌లో ఆర్మీ చీఫ్‌ నరవణె పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సీనియర్‌ అధికారి మనోజ్‌ పాండే ఏప్రిల్‌ అనంతరం ఈ పదవి చేపట్టే అవకాశాలున్నాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అమరజవాన్లకు నివాళులు అర్పించారు.    

మరిన్ని వార్తలు