బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ శబ్దం

2 Jul, 2021 14:26 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ శబ్దం వినిపించింది. దీంతో బెంగళూరు నగర వాసులు ఉలిక్కిపడ్డారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వినిపించిన ఈ భారీ శబ్దం ధాటికి పలు నివాసాల్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. హెచ్‌ఎస్ఆర్ లే అవుట్, మహదేవపుర, సిల్క్‌బోర్డ్, మడివాల, బొమ్మనహళ్లి, కొత్తనూరు, అగర, హుళిమావు, అనేకల్, పద్మానభ నగర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ శబ్దం వినిపించింది. ఈ శబ్దానికి గల కారణాలపై బెంగళూరు పోలీసుల ఆరాతీస్తున్నారు.

అయితే ఈ శబ్దం గత సంవత్సరం సోనిక్‌ బూమ్‌ను గుర్తుచేస్తోంది. 2020 మేలో కూడా బెంగళూరు అంతటా ఒక్కసారిగా భారీ శబ్దంలు వినిపించిన విషయం తెలిసిందే. ఇది మ‌రొక సోనిక్ బూమ్‌ అని బెంగళూరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.  ఈ శ‌బ్దంపై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పందిస్తూ.. త‌మ విమానాలు ఇలాంటి శ‌బ్దాలు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు