రాజ‌స్థాన్‌లో భూకంపం

13 Aug, 2020 09:35 IST|Sakshi

జైపూర్ :  రాజ‌స్తాన్‌లో  గురువారం తెల్ల‌వారుజామున 4.10 గంటలకు భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 5.5గా న‌మోదైంద‌ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు తెలిపారు. రాజ‌స్థాన్ బిక‌నేర్ న‌గ‌రానికి  669 కిలోమీటర్ల దూరంలో భూకంప తీవ్ర‌త‌ను గుర్తించారు. భూకంప ఉప‌రితలానికి దాదాపు 30 కిలోమీట‌ర్ల లోతులో భూమి కంపించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. గ‌త వారంలోనూ రాజ‌స్థాన్‌లో భ‌కంపం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస భూ ప్ర‌కంప‌న‌ల‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. 


 

మరిన్ని వార్తలు