ఆస్పత్రిలో చేరిన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే.. విశ్రాంతి లేకుండా పోరాడుతూ ఆ నొప్పిని..

11 Nov, 2021 14:13 IST|Sakshi

ముంబై: మెడనొప్పి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం తెలిపారు. గత రెండేళ్లుగా కోవిడ్‌–19పై విశ్రాంతి లేకుండా పోరాడుతూ మెడ నొప్పిని పట్టించుకోలేదని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరైన చికిత్స కోసం, వైద్యులు రెండు–మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచించడంతో ఆస్పత్రిలో చేరుతున్నానని చెప్పారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఏ ఆస్పత్రిలో చేరుతున్నారనే విషయాన్ని ప్రకటనలో సీఎం వెల్లడించలేదు.   

చదవండి: (దావూద్‌ అనుచరుడితో ఫడ్నవీస్‌కు లింకు)

మరిన్ని వార్తలు