అమానవీయ ఘటన: తోడేలును బైక్‌కు కట్టి..

18 Oct, 2021 04:10 IST|Sakshi

సాక్షి, యశవంతపుర(కర్ణాటక): తోడేలును చంపి బైక్‌కు కట్టి లాక్కెళ్లిన అమానుష ఘటన గదగ జిల్లా శిరహట్టి తాలూకా సీగిహళ గ్రామంలో జరిగింది. శనివారం సాయంత్రం శివరాజ్‌ అనే వ్యక్తి పొలంలో ఉండగా తోడేలు దాడి చేసింది.

దీంతో గ్రామస్తులు అందరూ తోడేలుపై కట్టెలతో దాడి చేసి చంపేశారు. అనంతరం దాన్ని బైక్‌కు కట్టి లాక్కెళ్లి కొండ ప్రాంతంలో పడేశారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో నిందితుల కోసం అటవీ అధికారులు గాలిస్తున్నారు.  

మరిన్ని వార్తలు