తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం

4 Jan, 2023 21:09 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

మాణిక్‌రావు థాకరే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీ, శివసేన ప్రభుత్వాలను తీవ్రంగా తూర్పార బట్టిన నాయకుడిగా ఆయనకు పేరుంది.   

చదవం‍డి: (వైఎస్సార్‌ పాదయాత్ర దేశ రాజకీయాలలో​ ఓ సంచలనం: భట్టి)

మరిన్ని వార్తలు