జమ్మూకశ్మీర్‌ ఎల్‌జీగా మనోజ్‌ సిన్హా

7 Aug, 2020 06:19 IST|Sakshi
మనోజ్‌ సిన్హా

కొత్త ‘కాగ్‌’గా గిరీశ్‌ చంద్ర ముర్ము

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత మనోజ్‌ సిన్హా (61)ను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రెస్‌ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటివరకూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన గిరీశ్‌ చంద్ర ముర్ము రాజీనామా చేయగా, ఆయన్ను నూతన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వికాస్‌ పురుష్‌గా పేరున్న మనోజ్‌ సిన్హా మూడుసార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు.   
 

మరిన్ని వార్తలు