మహారాష్ట్ర: పాల్ఘర్ జిల్లా వసాయిలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విజయ్ వల్లభ్ కోవిడ్ ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగడంతో 13 మంది రోగులు మృతి చెందారు. అగ్నిప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి:
భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని...
హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి