ఫార్మా గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిన జ్వాలలు

24 Oct, 2022 16:30 IST|Sakshi

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై మహా నగరంలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఫార్మా సంస్థలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని కార్లు, ఇతర వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేసింది. 

‘సోమవారం ఉదయం 8 గంటలకు మాకు సమాచారం అందింది. అది ఫార్మా సంస్థకు చెందిన గోదాం. మంటలను అదుపు చేశాం.’ అని అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు తెలిపారు. నగరంలోని అశోక్‌ నగర్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు... అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నహర్లాగున్ అటవీ ప్రాంతంలోని ఓ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక విభాగం వెల్లడించింది.

ఇదీ చదవండి: ‘మహా’ పాలిటిక్స్‌.. షిండేకు పదవీ గండం.. బీజేపీలోకి 22 మంది ఎమ్మెల్యేలు!

మరిన్ని వార్తలు