Bengaluru: బెంగుళూరులో విషాదం.. మెట్రో పిల్లర్‌ కూలి తల్లీ, మూడేళ్ల కొడుకు మృతి

10 Jan, 2023 14:43 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ కూలి తల్లీ, కుమారుడు మృతి చెందిన ఘటన నగవర ప్రాంతంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. తేజస్వీ(25) అనే మహిళ తన భర్త లోహిత్‌, రెండున్నరేళ్ల కూమార్తె, కుమారుడు విహాన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై హెబ్బాల్‌ వైపు వెళుతున్నారు.

ఈ క్రమంలో కళ్యాణ్‌ నగర్‌ నుంచి హెచ్‌ఆర్‌బీర్‌ లేఅవుట్‌ వరకు చేపట్టిన నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ కుప్పకూలి రోడ్డు మీద పడింది. బైక్‌పై వెళ్తున్న కుటుంబంపై ఇనుప రాడ్‌లతో కూడిన మెట్రో పిల్లర్‌ పడటంతో వారు తీవ్ర గాయపడ్డారు.

ముగ్గురుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వివాహితతోపాటు ఆమె మూడే కుమారుడు మరణించారు. తేజశ్విని భర్త, కుమార్తె చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మెట్రో పిల్లర్‌ కూలడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి.

చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్‌ ఘటన: ప్రయాణికులను ఎక్కించుకోకుండా..

మరిన్ని వార్తలు