కుప్పకూలిన యుద్ధ విమానం, పైలట్‌ మృతి

17 Mar, 2021 16:40 IST|Sakshi

కుప్పకూలిన మిగ్ -21 బైసన్‌ ఘోర ప్రమాదం 

కెప్టెన్ ఏ గుప్త మృతి 

సాక్షి,  న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం ప్రమాదం విషాదాన్ని నింపింది.  బుధవారం శిక్షణలో భాగంగా ఈ యుద్ధ విమానం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన  గ్రూపు కెప్టెన్ ఏ గుప్త మృతి చెందినట్లు ఐఎఎఫ్ తెలిపింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు వెల్లడించింది.  సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. 

సెంట్రల్ ఇండియాలోని వైమానిక స్థావరంనుంచి రోజువారీ శిక్షణలో భాగంగా బయల్దేరిన విమానం కొద్దిసేపటికే ప్రమాదంలో చిక్కుకుని కుప్ప కూలింది. గుప్త మృతిపై  ఐఏఎఫ్ ట్విటర్‌ ద్వారా తీవ్ర విచారాన్ని ప్రకటించింది. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపింది.  బాధిత కుటుంబానికి అండగా ఉంటామని  ట్వీట్‌ చేసింది. 

మరిన్ని వార్తలు