కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యం..

1 Jun, 2021 16:24 IST|Sakshi

తిరువనంతపురం: దేశంలో నైరుతి రుతుపవనాలు రెండ్రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నట్లు భారత దేశ వాతావరణ విభాగం తెలిపింది.  అయితే, దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.

అదే విధంగా, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం, మధ్య భారతదేశంలో ఓ మోస్తరు అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ విభాగం ఒక ప్రకటనలో  తెలియ చేసింది. 

మరిన్ని వార్తలు