Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

23 Nov, 2022 09:56 IST|Sakshi

1. ఏపీ సర్కార్‌ కొత్త చరిత్ర.. మీ భూమి మా హామీ
అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు సాకారం చేసి కొత్త చరిత్రను లిఖిస్తోంది.

👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2.ఏపీకి కేంద్ర బృందం కితాబు.. దేశమంతటా సచివాలయాలు
గ్రామీణ ప్రజలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలన్నీ సర్వత్రా ప్రశంసలు అందుకోగా దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మల్లారెడ్డి కుమారుడికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రికి తరలింపు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన కుమారులు, బంధువులు, బిజినెస్‌ పార్ట్‌నర్స్‌ ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. దక్షిణం గాలి ఎటువైపు? ఆప్‌ దెబ్బకు బీజేపీ ఆశలు గల్లంతేనా?
దక్షిణ గుజరాత్‌. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. ఒకవైపు వ్యాపారులు, మరోవైపు ఆదివాసీల సమ్మేళనమైన ఈ ప్రాంతవాసులు ఎటు వైపున్నారు?

👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. నవతరం నయా ట్రెండ్‌ ‘వీ’ ట్యూబింగ్‌.. ఇంతకి ఏంటది?
మన దేశంలో టాప్‌ యూట్యూబర్స్‌ ఎవరు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘వీట్యూబర్స్‌ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం రాకపోగా ‘ఇంతకీ వారు ఎవరు?’ అనే ఎదురు ప్రశ్న ఎదురుకావచ్చు.

👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఆర్థిక వ్యవస్థ: 40 లక్షల కోట్ల డాలర్లకు భారత్‌!
స్వచ్ఛ ఇంధనం, డిజిటలీకరణ విప్లవాల దన్నుతో 2047 నాటికి భారత ఎకానమీ 13 రెట్లు వృద్ధి చెందనుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ధీమా తెలిపారు. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ  40 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని చెప్పారు.

👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. త్రిష పారితోషికం డబుల్‌.. ఒక్కో సినిమాకు ఎన్నికోట్లో తెలుసా?
అదృష్టం ఎవరిని ఎప్పుడు? ఎలా? వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసొస్తే ప్రతిభ అనేది రెండోది అవుతుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి

👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. సౌదీ అరేబియా కమాల్‌ కియా... 
లుజైల్‌ స్టేడియం 88 వేల మంది ప్రేక్షకులతో హోరెత్తిపోతోంది... అందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా అభిమానులే అయినా... అర్జెంటీనాను ఆరాధించేవారు కూడా తక్కువేమీ కాదు! 

👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా..
వరకట్న వేధింపులకు మరో అబల బలైన ఘటన నెలమంగల తాలూకా భూసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. శ్రుతి (29) తన భర్త క్రిష్ణమూర్తి చేతిలో హత్యకు గురైంది. 

👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఐదు బ్యాక్టీరియాలకు.. భారత్‌లో 6.8 లక్షల మంది బలి
ఈ.కోలి. ఎస్‌ నిమోనియా, కె.నిమోనియా, ఎస్‌.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్‌లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్‌ జర్నల్‌ అధ్యయనంలో వెల్లడైంది.

👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు