సెల్ఫీ కావాలంటే రూ.100 కట్టాలంటున్న మంత్రి

19 Jul, 2021 07:46 IST|Sakshi

భోపాల్‌: తనతో ఎవరైనా సెల్ఫీ తీసుకోవాలంటే ర. 100 కట్టాల్సిందిగా మధ్యప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక  శాఖ మంత్రి ఉషా ఠాకర్‌ చెప్పారు. ఆయా సొమ్మును పార్టీ పనుల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. శనివారం ఆమె ఖాండ్వా వద్ద మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సెల్ఫీలు తీసుకోవడం వల్ల చాలా సమయం వృథా అవుతోందని, కొన్ని కార్యక్రమాలకు గంటల కొద్దీ ఆలస్యమవుతోందన్నారు. బీజేపీ స్థానిక మండల్‌ యూనిట్‌లో రూ. 100 కట్టడం ద్వారా తనతో సెల్ఫీ తీసుకోవచ్చన్నారు.  

మరిన్ని వార్తలు