ముంబై: పోలీసు ఉద్యోగం అంటేనే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. సమాజానికి రక్షణ కల్పించడంలో అత్యంత ముఖ్యమైనది. అందుకే ఎంతో మంది పోలీసుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటారు. ముఖ్యంగా మహిళా పోలీసులంటే ఎక్కువ గరౌవం ఇస్తారు.
అయితే ముంబై లాంటి మహానగరాల్లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉటుంది. పోలీసులను కొందరు లెక్కచేయరు, గౌరవించరు. ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. ముంబై లోకల్ రైలులో ప్రయాణించిన ఓ ఆకతాయి ప్రమాదకరంగా ఫుట్బోర్డుపైనే కూర్చున్నాడు. బాద్రా స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులను చూసి వేధించాడు. 'మేడం చాలా క్యూట్గా ఉన్నావ్' అంటూ ఈవ్ టీజ్ చేశాడు. ఆపై నోటికొచ్చింది వాగుతూ రెచ్చిపోయాడు.
మహిళా పోలీసులను ఇతడు వేధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే నిందితుడు దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు కావాలనే రికార్డు చేసినట్లు కన్పిస్తోంది.
मुंबई पुलिस हमारी सेवा में साल के 365 दिन 24 घंटे रहती है ऐसे में महिला पुलिस के साथ मस्तान कंपनी नाम से सोशल मीडिया पर वीडियो डालकर कुछ लोग बदतिमीजी कर रहे है महिला का अपमान करने वाले और छेड़छाड़ करने वालो को सबक सिखाना चाहिए। @CMOMaharashtra @MumbaiPolice @Central_Railway pic.twitter.com/YsxRrOVKDw
— जीवनधारा संघ ( NGO ) (@YOGibhai4091) March 13, 2023
ఈ వీడియోపై ముంబైకి చెందిన ఎన్జీఓ జీవధార సంఘ్ సీరియస్ అయింది. దీన్ని ట్విట్టర్లో షేర్ చేసి మహారాష్ట్ర సీఎం కార్యాలయం, ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది. దేశంలోనే మహిళలకు సేఫ్ సిటీ అని ముంబైని పిలుస్తుంటారు, ఇలాంటి ఘటనలు జరిగితే నగర ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరింది.
చదవండి: 60 అడుగుల బోరుబావిలో పడిన చిన్నారి.. 44 అడుగులు తవ్విన రెస్క్యూ టీం