సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఐక్యరాజ్య సమితి(ఐరాస) భద్రతా మండలి సమావేశం జరిగింది. వర్చువల్ విధానంలో జరిగిన భద్రతామండలి సమావేశంలో సముద్ర తీర భద్రతపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సముద్ర భద్రతకు సంబంధించిన ఐదంచెల వ్యూహాన్ని ప్రకటించారు.
ఈ భేటీలో మోదీ భారత్ విజన్ సాగర్ను వివరించారు. విజన్ సాగర్తో సముద్ర భద్రతపై సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు భద్రత, రక్షిణ, స్థిరత్వాన్ని.. విజన్ సాగర్ కల్పింస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.