వందేళ్ల ఆనందంలో రూ.100 నాణేం

25 Nov, 2020 20:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లక్నో విశ్వవిద్యాలయం 100 ఏళ్ల శంకుస్థాపన దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యూనివర్సిటీలలో కోర్సుల రూపకల్పనలో  తగిన జాగ్రత్తలు తీసుకొవాలని సలహా ఇచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసగించారు. డిజిటల్​ పరికరాలకు, సామాజిక మాధ్యమాలకు ఎల్లప్పుడూ సమయం కేటాయిస్తున్నారని.. సొంత విషయాలను కూడా చూసుకోవాలని సూచించారు. తమను తాము తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని.. అత్మవిశ్వాసం, సామర్థ్యంపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. స్థానిక వస్తువులను ప్రోత్సహించేలా కోర్సులు ఎందుకు రూపొందించకూడదని వర్సీటీ ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ వేడుక సందర్భంగా ప్రత్యేక స్టాంప్​తో పాటు రూ.100  నాణాన్ని ఆయన విడుదల చేశారు. 

కాగా, నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి డిసెంబర్​లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలో ఉన్న 5 విగ్రహాలను తాత్కాలికంగా తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. మొదట్లో డిసెంబర్ 10న శంకుస్థాపన తేదీగా అధికారులు ప్రతిపాదించారు. అయితే ప్రధాని అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి తుది తేదీని ఖరారు చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు