సముద్రంలో కూలిన మిగ్‌-29కే శిక్షణ విమానం

27 Nov, 2020 11:32 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిగ్‌-29కే శిక్షణా విమానం ప్రమాదవశాత్తూ సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు  ఆర్మీ అధికారులు ఇవాళ ఉదయం వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి ఒక పైలట్‌ను సురక్షితంగా కాపాడారు. మరొకరు గల్లంతు అయినట్లు తెలిపారు. గల్లంతు అయిన పైలట్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టమని నేవీ అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు