నక్సలైట్ల కాల్పుల్లో జవాన్ మృతి..! 

14 Aug, 2020 21:32 IST|Sakshi

చత్తీస్‌గడ్‌: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలోని కోటీ క్యాంపు సమీపంలో నక్సలైట్లు జవాన్లపై కాల్పులు జరిపిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. క్యాంప్ దగ్గరలోని ఓ కిరాణా షాపింగ్‌కి వెళ్లిన ఇద్దరు జవాన్లపై నక్సల్స్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన జవాన్‌ని దుష్యంత్ నందీశ్వర్‌గా గుర్తించి.. గాయపడిన జవాన్‌ని ఆస్పత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు