ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్..

15 Jan, 2023 16:21 IST|Sakshi

ముంబై: ఎన్సీసీ ఎంపీ సుప్రియా సూలేకు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర పుణెలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె చీరకు నిప్పంటుకుంది. ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తుండగా.. అక్కడున్న దీపం ఆమె చీరకు అంటుకుని మంట వచ్చింది.

అయితే ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. మంటను వెంటనే ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. పుణెలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: రాష్ట్రపతి ముర్ము ఆశీస్సుల కోసం ప్రయత్నించింది.. విషయం తెలియక సస్పెన్షన్‌కు గురైంది!

మరిన్ని వార్తలు