కర్ణాటకను వణికిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ 

17 May, 2021 03:22 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తుండగా చాప కింద నీరులా బ్లాక్‌ఫంగస్‌ వ్యాపిస్తోంది. కర్ణాటకలో ఇప్పటి వరకు సుమారు 100 బ్లాక్‌ ఫంగస్‌ పాజిటివ్‌ కేసులు తేలినట్లు సమాచారం. అంతేకాకుండా అందులో 9 మరణాలు ఉన్నట్లు తెలిసింది. రోజురోజుకీ బ్లాక్‌ ఫంగస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బ్లాక్‌ ఫంగస్‌ మరణాల్లో బెంగళూరులో రెండు, బాగల్‌కోటె, బెళగావిలో ఒక్కొక్కటి, మంగళూరులో నాలుగు మరణాలు నమోదయినట్లు సమాచారం. కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు