మంచు కొండచరియల బీభత్సం.. పర్వతారోహకులు మృతి!

4 Oct, 2022 14:40 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో మంచు కొండచరియలు విరిగిపడి బీభత్సం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 28 మంది పర్వతారోహకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస​్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. 

ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి స్పందించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ద్రౌపది దండ-2 పర్వతంలో హిమపాతం కారణంగా నెహ్రూ పర్వతారోహణ సంస్థకు చెందిన 28 మంది ట్రైనీలు మంచులో చిక్కుకుని మృతిచెందినట్టు సమాచారం అందింది. జిల్లా యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించింది అని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు