సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 44,658 కరోనా కేసులు నమోదు కాగా 496 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి 4,36,861 ప్రాణాలు కోల్పోయారు. అయితే 24 గంటల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు కేరళలో నమోదు అయ్యాయి. కేవలం ఒక్క రోజులో 30 వేల కేసులు, 162 మరణాలు నమోదు కావడం ఆ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం భారత్లో కరోనా మహమ్మారి అడ్డుకట్టకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది.
చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్