తగ్గుముఖం పట్టిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే?

25 Jan, 2022 09:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే 50,190 తక్కువ కేసులు నమోద కావడం గమనార్హం. పాజిటివిటీ  రేటు కూడా 20.75% నుండి 15.52%కి తగ్గింది. నిన్నటి తో పోలిస్తే 16% కరోనా కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 614 మంది మృతి చెందగా, కరోనా  నుండి కోలుకున్న వారి సంఖ్య 2,67,753గాఉంది.

చదవండి: U Turn Narrow Mountain Road: ఉగ్గబట్టుకుని చూడాల్సిన వీడియో! ఏది నిజం ఏది వైరల్‌!

మరిన్ని వార్తలు