Ram Nath Kovind: రాష్ట్రపతికి విజయవంతంగా కంటి శస్త్ర చికిత్స.. డిశ్చార్జ్‌

24 Sep, 2021 21:23 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కంటి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. రాష్ట్రపతి తన రెండవ కంటికి కంటిశుక్లం శస్త్రచికిత్సను శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రెఫరల్ & రీసెర్చ్) చేయించుకున్నారు. చికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు రాష్ట్రపతి భవన్‌ అధికారులు తెలిపారు.

అయితే ఇదివరకే ఆయన మొదటి కన్ను 2021 ఆగస్టు 19న ఆర్మీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. 75 ఏళ్ల కోవింద్, జూలై 25, 2017 న భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.

చదవండి: ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా..

మరిన్ని వార్తలు