ఎన్‌ఐఏ కస్టడీకి పీఎఫ్‌ఐ సభ్యులు

3 Jun, 2023 04:25 IST|Sakshi

సాక్షి, చెన్నై: నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)కి చెందిన ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది.

ఐసిస్‌కు అనుకూలంగా, దేశంలో మైనారిటీ పాలనే లక్ష్యంగా పీఎఫ్‌ఐ సాగిస్తున్న ప్రయత్నాలపై అనుమానంతో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి తమిళనాడుకు చెందిన 10 మంది సహా దేశ వ్యాప్తంగా 106 మందిని ఎన్‌ఐఏ ఇటీవల అరెస్టు చేసింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా చెన్నై, మదురై, దిండుగల్, తేనిలకు చెందిన అయిదుగురిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది.

మరిన్ని వార్తలు