కరోనా నుంచి కోలుకున్న నితిన్‌ గడ్కరీ

1 Oct, 2020 07:57 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కోలుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ ద్వారా తన ఆరోగ్యం గురించి చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నాని చెప్పడానికి సంతోషంగా ఉందని, తాను కోలుకోవాలని కోరుకున్న అందరి దీవెనల వల్లే తాను కోలుకున్నట్లు తెలిపారు. కరోనా సోకినట్లు ఈ నె 16న ఆయనకు తెలియగా, అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌ లో ఉన్నారు. పలువురు ఎంపీలు, కొందరు మంత్రులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. (చదవండి: సివిల్స్‌ ప్రిలిమినరీ యథాతథం)

మరిన్ని వార్తలు