NMC Relief: ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు కేంద్రం ఊరట.. సర్టిఫికేట్లు జారీ..

29 Jul, 2022 15:36 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఉక్రెయిన్‍లో చదువుకున్న వైద్య విద్యార్థులకు భారత ప్రభుత్వం ఊరటనిచ్చింది. యుద్ధ కారణంగా చదువు ఆగిపోయిన విద్యార్థులకు ఉపశమనమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 కన్నాముందు మెడిసిన్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్‌కు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్లు జారీ చేసింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష(ఎఫ్‌ఎంజీఈ) రాసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో అర్హత సాధించిన వారు రెండేళ్లపాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్‌ ఇంటర్న్‌షిప్(CRMI) చేయాల్సి ఉంటుంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కరోనా లేదా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా చాలా మంది వైద్య విధ్యార్థులు మెడిసిన్ పూర్తి చేయకుండా ఫైనల్ ఇయర్‌లోనే తిరిగొచ్చారు. వారు ఎలాంటి ఫిజికల్ ట్రైనింగ్‌  తీసుకోలేదు. దీంతో సీఆర్‌ఎంఐని రెండేళ్లు తప్పనిసరి చేసింది కేంద్రం. సాధారణ వైద్య విద్యార్థులకు ఇది ఒక్క ఏడాదే ఉంటుంది.
చదవండి: జర జాగ్రత్త.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

మరిన్ని వార్తలు