కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి సర్కార్‌ బ్రేక్‌.. అసలేం జరిగింది?

10 Jun, 2022 12:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విలాసవంతమైన నౌక కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. పుదుచ్చేరిలో హాల్ట్‌కి నిరాకరించింది. క్రూయిజ్‌లో కేసీనో, గ్యాంబ్లింగ్‌ ఉండటంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు. తెల్లవారు జామున 4 గంటల నుంచి షిప్‌ ఆగిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో క్రూయిజ్‌ ఆపరేట్లు చర్చలు జరుపుతున్నారు. పాండిచ్చేరి అనుమతించకపోతే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కడులూరు పోర్ట్‌లో నౌకను ఆపేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
చదవండి: మాములుగా లేదు మరి.. షిప్‌ లోపల ఓ లుక్కేయండి..

మరిన్ని వార్తలు