Omicron In India Update: ఒమిక్రాన్‌ అప్‌డేట్స్‌: భారత్‌లో ఒక్కరోజే 122 కేసులు

24 Dec, 2021 12:39 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, న్యూఢిలీ​: దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 122 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 358 కి చేరింది. భారత్‌లోని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో 88, మహారాష్టలో 67 కేసులున్నాయి. ఒమిక్రాన్‌ బాధితుల్లో 114 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది.

ఇక కోవిడ్‌ అప్‌డేట్‌ చూస్తే.. గడిచిన 24 గంటల్లో 6,650 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 374 ప్రాణాలు విడిచారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 77,516 గా ఉంది. రికవరీ రేటు 98.40, పాజిటివిటీ రేటు 0.57 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో 140.31 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 66.98 కోట్ల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు.

 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసుల వివరాలు

మరిన్ని వార్తలు