అతి పొడవైన టన్నెల్‌ని ప్రారంభించనున్న మోదీ

3 Oct, 2020 08:25 IST|Sakshi

షిమ్లా: మనాలి–లేహ్‌ మధ్య 46 కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని తగ్గించే హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌ వద్ద కీలకమైన అటల్‌ టన్నెల్‌ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు.  ఇది ప్రపంచంలోనే హైవేపై నిర్మించిన అతి పొడవైన టన్నెల్‌. 9.02 కిలోమీటర్ల ఈ టన్నెల్‌ రక్షణ రీత్యా అత్యంత వ్యూహాత్మకమైనది.

మనాలీ లేహ్‌ల మధ్య 4 నుంచి 5 గంటల ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ఈ టన్నెల్‌ను సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో, అత్యాధునిక సాంకేతికతతో నిరి్మంచారు. ప్రారంభం అనంతరం ప్రధాని మోదీ, బస్సులో ఈ టన్నెల్‌ మార్గంలో ప్రయాణిస్తారు.  (కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం)

మరిన్ని వార్తలు