Ambedkar Jayanti 2022: బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి.. ప్రధాని మోదీ నివాళులు

14 Apr, 2022 12:31 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ ఆలోచనలే.. కేంద్రప్రభుత్వ విధానాలకు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకంగా పథకాలు రూపొందిస్తూ.. సామాజిక న్యాయం దిశగా కృషిచేస్తున్నామని తెలిపారు. డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్‌ ప్రాంగణంలో నివాళులు అర్పించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జేపీ నడ్డా, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తదితరులు అంబేడ్కర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు

మరిన్ని వార్తలు