PM Modi Mother Hospitalised: నిలకడగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ ఆరోగ్యం

28 Dec, 2022 13:50 IST|Sakshi

అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. కాగా హీరాబెన్‌ ఈ ఏడాది జూన్‌లోనే 99వ పుట్టినరోజు జరుపుకున్నారు.

ప్రధాని తల్లి హీరాబెన్‌ ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు​ స్పందించారు. బుధవారం అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుప్రతిలో చేరారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం  నిలకడగానే ఉందని తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.


The health of the Prime Minister's  mother Hiraba is improving. Today She was admitted to UN Mehta Institute of Cardiology and Research Center in Ahmedabad. This institute has just issued a health bulletin. (బులిటెన్‌ సారాంశం)

మరిన్ని వార్తలు