Bihar Viral News: బాలుడిని కాటేసి అక్కడే చనిపోయిన పాము.. షాక్‌లో పేరెంట్స్‌

23 Jun, 2022 11:37 IST|Sakshi

మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి డైరెక్షన్‌ చేసిన వినయ విధేయ రామ సినిమాలో విలన్‌ను పాము కాటు వేశాక.. ఆ పాము చనిపోవడం చూశాము కదా.. అలాంటి ఘటనే నిజ జీవితంలోనూ చోటుచేసుకుంది. ఓ బాలుడిని కాటు వేసిన పాము అక్కడికక్కడే చనిపోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప‍్రకారం.. మధోపుర్​ గ్రామానికి చెందిన రోహిత్​ కుశ్వాలాకు అనూజ్​ కుమార్ అనే కొడుకు​ ఉన్నాడు. కాగా, అనూజ్​ తన తల్లితో సహా కుచాయ్​కోట్‌లో ఉన్న అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. రోజులాగే అనూజ్‌ ఇంటి ముందు ఆడుకుంటుడగా.. ఓ పాము(విష సర్పం)ను బాలుడిని కాటు వేసింది. దీంతో, అనూజ్‌ ఏడ్చుకుంటూ వెళ్లి పాము కాటు వేసిందని తల్లికి చెప్పాడు. 

దీంతో కుటుంబ సభ్యులు.. అనూజ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అనూజ్‌ ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. బాలుడిని కాటు వేసిన కొద్దిసేపటికే  పాము చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులుతో పాటు స్థానికులు షాకయ్యారు. అనంతరం, ఆ పామును ఓ డబ్బాలో వేసి స్థానికులు.. అధికారులకు అందజేశారు. ఇక, పాము కాటు వేసినా బాలుడి బ్రతికే ఉండటంతో అతడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: నదీస్నానంలో భార్యకు ముద్దు.. బయటకు లాగి చితకబాదిన జనం

మరిన్ని వార్తలు