గడ్చిరోలిలో మావోయిస్టుల డంప్‌ లభ్యం .. రూ.15.96 లక్షల నగదు

3 Jul, 2021 09:57 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర సామగ్రి  

కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా కుద్రీ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల డంప్‌ లభ్యమైంది. ప్రత్యేక పోలీస్‌ బలగాలతో గురువారం రాత్రి కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ డంపు దొరికిందని ఎస్పీ అంకిత్‌గోయల్‌ తెలిపారు. అందులో రూ.15.96 లక్షల నగదు, మూడు డిటోనేటర్లతో పాటు వైర్‌ బండిళ్లు, వాకీటాకీ, బ్యానర్లు, కిట్‌బ్యాగులు ఉన్నాయని ఆయన శుక్రవారం విలేకరులకు వివరించారు.

మరిన్ని వార్తలు