ఇంకా కోమాలోనే ప్రణబ్‌ ముఖర్జీ

26 Aug, 2020 12:23 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ఇంకా తీవ్ర కోమాలోనే ఉన్నట్లు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆస్పత్రి బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటెన్‌లో తెలిపింది. ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. (చదవండి: ‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’

ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్‌ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ప్రణబ్‌కు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు