న్యూఢిల్లీ : వచ్చే సంవత్సరం నుంచైనా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కోరారు. డయ్యూలో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఘోగ్లా బీచ్లో జాగింగ్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ఒక కష్టతరమైన ఏడాదిని పూర్తిచేసుకొని 2021లోకి అడుగుపెడుతన్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం అని ట్వీట్ చేశారు. (సీఎం రావత్కు అస్వస్థత, ఎయిమ్స్కు తరలింపు )
Jogged on the pristine Ghoghla beach in Diu this morning.
As we enter 2021, after a difficult year that has tested us all, let us rise together and make an endeavour to remain fit and healthy.
May the coming year bring good health and prosperity in our lives. pic.twitter.com/dcQjZxB4Xk
— President of India (@rashtrapatibhvn) December 28, 2020
ఆదివారం ఘోగ్లా బీచ్ను సందర్శించిన ఆయన డయ్యూలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా డయ్యూలో కల్చరల్ హెరిటేజ్ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు, స్వచ్ఛత కోసం స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఇటీవలే నిష్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాంతానికి "బ్లూ ఫ్లాగ్" ధృవీకరణ పత్రాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా రామ్నాథ్ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్తాపన చేశారు. నాలుగు రోజుల పర్యటన అనంతరం నేడు ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. (ఆ పదవిపై ఆసక్తి లేదు: శరద్ పవార్)