సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి 20 లక్షల విరాళం

27 Jul, 2020 06:53 IST|Sakshi
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

న్యూఢిల్లీ: కార్గిల్‌ యుద్ధంలో పోరాడి విజయం సాధించి అమరులైన సైనికులకు నివాళిగా ఢిల్లీలోని సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూ.20 లక్షలు విరాళమిచ్చారు. కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన శ్వాసకోçశ సంబంధిత యంత్రాలను కొనుగోలు చేస్తారని అధికారులు వెల్లడించారు.  రూ. 20 లక్షలను చెక్కు ద్వారా అందించారని పేర్కొన్నారు. రాష్ట్రపతి తన ఖర్చులను తగ్గించుకుని ఈ డబ్బును విరాళం ఇచ్చినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు