వైరల్‌ వీడియో: మురుగు నీరు తాగే.. పంజాబ్‌ సీఎం ఆస్పత్రి పాలు?!

21 Jul, 2022 14:05 IST|Sakshi

ఛండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(48) కడుపు నొప్పితో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని వైద్యులు నిర్ధారించారు కూడా. అయితే ఇప్పుడు ఆ ఇన్‌ఫెక్షన్‌కు కారణం ఏంటో బయటకు వచ్చింది. 

పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌.. పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగు వ్యర్థాలతో కూడిన నీటిని పంజాబ్ ముఖ్యమంత్రి నిరభ్యంతరంగా తాగారని, అందుకే ఆయనకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు.. ఆయనకు సంబంధించిన వీడియో కూడా ఒకటి వైరల్‌ అవుతోంది. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ చేసిన ఆ ట్వీట్‌లో పార్టీ సభ్యుల నినాదాల మధ్య ఆయన గ్లాస్‌ నీటిని తీసుకుని తాగారు. రాజ్యసభ ఎంపీ, ప్రముఖ పర్యావరణవేత్త బాబా బల్బీర్‌ సింగ్‌ సుల్తాన్‌పూర్‌ లోధీలో చేపట్టిన  కాళి బెన్‌ శుభ్రత కార్యక్రమంలోనిది ఆ వీడియో. అది జరిగిన వారంలోపే ఆయన ఆస్పత్రి పాలు కావడం విశేషం. అయితే ఆయన ఆస్పత్రి పాలుజేసింది ఆ నీరేనా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు