పంజాబ్​లో మరోసారి రాజుకున్న పోస్టర్​ వివాదం..

10 Jun, 2021 14:37 IST|Sakshi

చత్తీస్‌గఢ్‌: పంజాబ్​ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్​ సింగ్​, అమృత్​సర్​ ఎమ్మెల్యే నవజ్యోత్​ సిద్ధూల మధ్య తరచుగా ఏదో ఒక వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు ఒక పోస్టర్​ వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, నవజ్యోత్​ సింగ్​ సిద్దూ గత కొన్ని రోజులుగా అమృత్​ సర్​ నుంచి పాటియాలకు తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేయసాగారు. కాగా, కెప్టెన్​ అమరీందర్​సింగ్​కు  పాటియాలా కంచుకోటలాగా భావిస్తారు. ఇప్పుడిదే వీరిద్దరి మధ్య వివాదానికి  కేంద్ర బిందువుగా మారింది.

ఈ క్రమంలో నవజ్యోత్​ సింగ్​ కనిపించడంలేదని అమృత్​సర్​లో పలుచోట్ల పోస్టర్​లు.. దానిపై సిద్ధూని పట్టిస్తే, 50 వేల రూపాయల రివార్డని కూడా ప్రకటించారు. అదే విధంగా,  షాహిద్​ బాబా దీప్​ సింగ్​ సేవా సోసైటీ అనే ఒక ఎన్జీవో సంస్థ (గుమ్​షుడా డి తలాష్​) తప్పిపోయిన ఎమ్మెల్యేను వెతకండి అని పోస్టర్​లను విడుదల చేసింది. అదే విధంగా, పాటియాలలో కూడా కొన్ని పోస్టర్​లు వెలిశాయి. దీంతో వీరిద్దరి రచ్చ కాస్త కాంగ్రెస్​ హైకమాండ్​ దృష్టికి వెళ్లింది.

ఇప్పటికే కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ పనితీరుపై 20 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని  పలు నివేదికలు కాంగ్రెస్​కు చేరాయి. దీని వెనుక సిద్ధూ హస్తం ఉందని భావిస్తారు. వీరి మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్​ అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో ఒక ప్యానల్​ను నియమించింది.  ఈ కమిటీకి మల్లి ఖార్జున్​ ఖర్గేను నాయకత్వం వహించనున్నారు.  పంజాబ్​ కాంగ్రెస్​ పార్టీ ఇన్​చార్జ్​  హరిష్​ రావత్​, మాజీ ఎంపీ జేపీ అగర్వాల్​ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

చదవండి: ఇక్కడ​ నుంచి కదలరు..  ఎస్సై, సీఐ, ఏసీపీ.. ఏ ప్రమోషన్‌ వచ్చినా..  

మరిన్ని వార్తలు