వైరల్: నేల మీద పంజాబ్‌ రాఫెల్ ప్రయాణం‌!

5 Mar, 2021 14:43 IST|Sakshi

చంఢీగఢ్‌: విమానం అనగానే మనకు వేగం..ఆకాశంలో ఎగరడం గుర్తొస్తుంది. అయితే ఈ ‘పంజాబ్‌ రాఫెల్‌’ మాత్రం కాస్త స్సెషల్‌ . ఇది ఆకాశంలో కాకుండా నేలమీద ప్రయాణిస్తొంది. పంజాబ్‌లోని బతిండాకు చెందిన ఆర్కిటెక్ట్‌ రాంపాల్‌ బెహనీవాల్‌ దీన్ని తయారు చేశాడు. కాగా, రాఫెల్‌ను స్ఫూర్తిగా తీసుకొని దీన్ని తయారు చేసినట్టు ఆయన తెలిపాడు. ఇది రాఫెల్‌ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ పంజాబ్‌ రాఫెల్‌ నేలపై గంటకు 15-20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. దీని తయారీకి మూడు లక్షలు ఖర్చయ్యిందని రాంపాల్‌ తెలిపాడు.

కాగా, రాఫెల్‌లో ఎగరలేని వారు తన పంజాబ్‌ రాఫెల్‌లో ప్రయాణించి కోరిక నెరవేర్చుకోవచ్చని తెలిపాడు. మొత్తానికి ఈ రాఫెల్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్ని తొందరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పంజాబ్‌ ఆర్కిటెక్ట్‌  తెలిపాడు.

చదవండి: వైరల్‌: ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓడ!

మరిన్ని వార్తలు