ముగిసిన రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర.. కాశ్మీర్‌లో కీలక వ్యాఖ్యలు

29 Jan, 2023 18:42 IST|Sakshi

శ్రీనగర్‌: కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కొనసాగిన విషయం తెలిసిందే. 2022 సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి జనవరి 29 2023 వరకు దాదాపు 150 రోజుల పాటు రాహుల్‌ యాత్ర కొనసాగింది. 

కాగా, జనవరి 30(సోమవారం)న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శ్రీనగర్‌లో యాత్ర ముగింపు భారీ బహిరంగ సభ జరగనుంది. అయితే, భారత్‌ జోడో యాత్ర ముగిసిన అనంతరం కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది. భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన వచ్చింది. రైతులు, నిరుద్యోగ యువత సమస్యలు తెలుసుకున్నాను అని కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు