రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

20 Apr, 2021 16:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.  ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నాలో కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్‌ అని తేలింది. నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా జాగ్రత్తలు తీసుకోండి’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 

అంతకుముందు వ్యాక్సినేషన్ మూడో విడతపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విధానంలో బలహీన వర్గాల వారికి వ్యాక్సిన్ అందుతుందనే భరోసా లేదని ఆయన విమర్వించారు.

చదవండి :
స్వీయ నిర్బంధంలోకి ఢిల్లీ సీఎం: ఎందుకంటే? 
ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌కు కరోనా: పరిస్థితి విషమం

మరిన్ని వార్తలు