సెల్ఫ్ క్వారంటైన్‌లో అశోక్ గ‌హ్లోత్

28 Aug, 2020 13:01 IST|Sakshi

జైపూర్ : రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. దీంతో ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లోత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సీఎంవో కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న 9మంది ఉద్యోగులు, త‌న నివాసంలోని ఓ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో  ముందుజాగ్రత్త చర్యగా షెడ్యూల్ ప్ర‌కారం జర‌గాల్సిన కార్యక్రమాలు, సమావేశాలను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్న‌ట్లు సీఎంవో కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  త‌న‌ను క‌ల‌వ‌డానికి ఎవ‌రూ రావ‌ద్దొంటూ సీఎం తెలిపారు. రాష్ర్టంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య  75,303కు చేర‌గా 24 గంట‌ల్లోనే 610కు పైగా క‌రోనా కేసులు న‌మ‌ద‌య్యాయి. 


 

మరిన్ని వార్తలు