రాజస్తాన్‌ మాజీ గవర్నర్ కన్నుమూత

8 Mar, 2021 20:57 IST|Sakshi

జైపూర్: రాజస్తాన్‌ మాజీ గవర్నర్, రిటైర్డ్‌ జస్టిస్ అన్షుమాన్ సింగ్ (86) సోమవారం కన్నుమూశారు. ఆయన ఆనారొగ్య సమస్యలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. 1999 నుంచి 2003 వరకు ఆయన రాజస్తాన్‌ గవర్నర్‌గా సేవలు అందించారు. 1998లో గుజరాత్‌ గవర్నర్‌గానూ ఆయన పనిచేశారు. అన్షుమాన్ 1935లో అలహాబాద్‌లో జన్మించారు. ఆయన మృతి పట్ల రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌‌ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ, ప్రజాజీవితంలో అన్షుమాన్ సింగ్‌ చేసిన సహకారం ఎప్పుడూ మరువలేనిదని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు బలం చేకూర్చాలని సీఎం కోరుకున్నారు.

చదవండి:  West Bengal Elections 2021: సివంగి సింగిల్‌గానే వస్తుంది

మరిన్ని వార్తలు