రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ లైసెన్స్‌ రద్దు

23 Oct, 2022 11:15 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ) రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌(ఆర్‌జీఎఫ్‌)కి విదేశీ నిధుల లైసెన్స్‌ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌(ఆర్‌జీఎఫ్‌)కి ఉన్న విదేశీ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ లైసెన్స్‌ని కేంద్రం రద్దు చేసింది. ఇది గాంధీ కుటుంబాలకు చెందిన ప్రభుత్వేతర సంస్థ. ఐతే ఈ సంస్థ విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించిందని, అందువల్ల ఈ లైసెన్స్‌ని రద్దు చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

జూలై 2020లో ఎంహెచ్‌ఏ దీనిపై ఒక కమిటి నియమించి, వారి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేగాదు లైసెన్స్‌ రద్దు చేస్తున్నట్లు ఆర్‌జీఈఎఫ్‌ కార్యాలయానికి నోటీసులు జారీ చేశామని కూడా తెలిపింది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఫౌండేషన్‌కి చైర్‌ పర్సన్‌ కాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి చిదంబరం, పార్లమెంట్‌ సభ్యులు రాజీవ్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ట్రస్ట్‌ సభ్యులు.

ఈ ఫౌండేషన్‌ని 1991లో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫౌండేషన్‌ 1991 నుంచి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్‌, టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు మద్దతుతో సహా అనేక క్లిష్టమైన సమస్యలపై పనిచేసింది. పైగా విద్యా రంగానికి సంబంధించి పలు సేవలు అందించింది.

(చదవండి: తెలంగాణలోకి రాహుల్‌ యాత్ర.. జోడో యాత్ర ఇలా కొనసాగుతుంది..)

మరిన్ని వార్తలు