అగ్నిపథ్‌పై త్రివిధ దళాధిపతులపై రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ

18 Jun, 2022 12:29 IST|Sakshi

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత కారణంగా త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన హింస్మాతక, విధ్వంసక ఘటనలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే, అగ్నిపథ్‌పై మరోసారి కూలంకషంగా త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చించనున్నారు. 

ఇది కూడా చదవండి: అగ్నిపథ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

మరిన్ని వార్తలు