Lalu Prasad Yadav Health Update: లాలూ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.. సింగపూర్‌కు తరలించే అవకాశం

7 Jul, 2022 11:43 IST|Sakshi

న్యూఢిల్లీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన శరీరంలో కదలికలు లేవని తనయుడు తేజస్వీ యాదవ్‌ తెలిపారు. ఇప్పటి వరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారని, అయినా ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. వైద్యులు మరోసారి పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దానిపై తేజస్వీ యాదవ్‌ నిర్ణయం తీసుకుంటామన్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్‌ తీసుకెళ్తామని తేజస్వి యాదవ్‌ ఇది వరకే వెల్లడించారు.

ఇంట్లో మెట్లపై నుంచి కిందపడిన సమయంలో లాలూకు మూడు చోట్ల గాయాలయ్యాయి. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. లాలూ పరిస్థితి విషమించిన నేపథ్యంలో పలువురు బిహార్‌ మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఢిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

చదవండి: (Corona Updates: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు)

మరిన్ని వార్తలు