Rohini Sindhuri: మైసూరులో పెద్ద ఎత్తున భూముల కబ్జా..

25 Jun, 2021 08:10 IST|Sakshi

సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంతో పాటు జిల్లాలో పెద్ద ఎత్తున భూముల అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి చెందిన అనేక భూములు కబ్జా అయ్యాయని, అలాంటి వాటిపై దర్యాప్తు చేయించాలని రాచనగరి జిల్లా అధికారిగా పనిచేసి బదిలీపై వెళ్లిన ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి మైసూరు ప్రాదేశిక కమిషనర్‌ ప్రకాశ్‌కు లేఖ రాశారు.

దీనిపై సమగ్రవిచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని జిల్లాధికారి నివాసంలో ఈత కొలను నిర్మాణంపై దర్యాప్తు నేపథ్యంలో రోహిణి ఈ లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది.   

చదవండి: Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర..

>
మరిన్ని వార్తలు