ఆ రెండిటి మధ్య అత్యంత అరుదైన పోరు 

7 Sep, 2020 11:56 IST|Sakshi
పోరులో మృత్యువాతపడ్డ బెంగాల్‌ టైగర్‌, అడవి పంది

దిస్ఫూర్‌ : రాయల్‌ బెంగాల్‌ టైగర్‌, అడవి పందికి మధ్య గొడవ జరిగితే ఏది గెలుస్తుంది? కచ్చితంగా పెద్దపులే అంటారందరూ. కానీ, మనం చెప్పుకోబోయే సంఘటనలో గెలుపు రెండిటిదీ కాదు.. చావుది. రెండిటికి మధ్య జరిగిన గొడవలో ఆ రెండూ మృత్యువాతపడ్డాయి. ఈ సంఘటన అస్సాంలోని జోర్‌హట్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అస్సాం, జోర్‌హట్‌ కొహారా రిజర్వ్‌ ఫారెస్ట్‌లో కొన్ని రోజుల క్రితం రాయల్‌ బెంగాల్‌ టైగర్‌, అడవి పందుల మధ్య భీకర పోరు జరిగింది. పులి కడుపు భాగంలో, పంది శరీరం మొత్తం తీవ్రమైన గాయాలయ్యాయి. ( గుండెపోటుతో ‌ ‘కదంబ’ మృతి )

దీంతో ఆ రెండూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. గత శనివారం కుళ్లిపోయిన స్థితిలో రెండు జంతువుల్ని గుర్తించారు అటవీ శాఖ సిబ్బంది. దీనిపై అటవీ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ కొహారా రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఇలాంటి సంఘటన జరగటం ఇదే మొదటిసారి. అడవి పందితో పోట్లాడి రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృత్యువాత పడింది’’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు